రామ మందిర నిర్మాణంలో భాగస్వాములు కావాలి
ABN , First Publish Date - 2021-01-20T05:52:20+05:30 IST
అయోధ్యలో రామ మందిర ని ర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వా ములు కావాలని, మందిర నిర్మా ణానికి విరాళాలు ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ విభాగ్ జిల్లా ప్రచార కార్యదర్శి వంశీ పిలుపునిచ్చారు.
ఏలూరు రూరల్, జనవరి 19 : అయోధ్యలో రామ మందిర ని ర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వా ములు కావాలని, మందిర నిర్మా ణానికి విరాళాలు ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ విభాగ్ జిల్లా ప్రచార కార్యదర్శి వంశీ పిలుపునిచ్చారు. రూరల్ మండలం శనివారపు పేట శ్రీరామ్నగర్లోని తపన ఫౌండేషన్ కార్యాలయంలో సంస్థ వ్యవస్థాపకుడు గారపాటి చౌదరి, దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ శ్రీరామజన్మభూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా గారపాటి చౌదరి మందిర నిర్మాణానికి ఒక లక్షా 23 వేల 456 రూపాయలు విరాళాన్ని చెక్కు రూపంలో అందించి మాట్లాడారు. మందిరం నిర్మాణానికి 15 రోజుల పాటు దెందులూరు నియోజకవర్గంలో ప్రతి గడపకు వెళ్లి విరాళాలు సేకరించేందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.