మహిళల పట్ల సంజయ్‌ వ్యాఖ్యలు సరికాదు

ABN , First Publish Date - 2021-03-08T07:59:44+05:30 IST

నాగర్‌కర్నూల్‌లో జరిగిన సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని జాతీయ బీసీ మహిళా సమాఖ్య చైర్‌పర్సన్‌ ఎం.భాగ్యలక్ష్మి అన్నారు.

మహిళల పట్ల సంజయ్‌ వ్యాఖ్యలు సరికాదు

క్షమాపణలు చెప్పాలి: జాతీయ బీసీ మహిళా సమాఖ్య

పంజాగుట్ట, మార్చి 7(ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్‌లో జరిగిన సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని జాతీయ బీసీ మహిళా సమాఖ్య చైర్‌పర్సన్‌ ఎం.భాగ్యలక్ష్మి అన్నారు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆదివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో ఆమె మాట్లాడారు. కొన్నిరోజుల క్రితం గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌.. గో మాంసం తినే వాళ్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలనూ తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. 


Updated Date - 2021-03-08T07:59:44+05:30 IST