సంజాయిషీలకే ఢిల్లీ పర్యటన
ABN , First Publish Date - 2020-09-25T08:23:58+05:30 IST
సీఎం జగన్కు తన కేసుల భవిష్యత్తు తప్పించి.. రాష్ట్ర భవిష్యత్తు పట్టదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు.
యనమల
అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్కు తన కేసుల భవిష్యత్తు తప్పించి.. రాష్ట్ర భవిష్యత్తు పట్టదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. జగన్ చేస్తున్న ఢిల్లీ పర్యటనలు కూడా తన భవిష్యత్తు కోసమేనని యనమల వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అరాచకాలు, అవినీతి చేయడం.. ఢిల్లీ వెళ్లి సంజాయిషీలు ఇచ్చుకోవడం... ఇదే జగన్ పని అని ఆయన ధ్వజమెత్తారు.
ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా కేంద్ర మంత్రులతో కలిసి ఉమ్మడి ప్రెస్మీట్లు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. కనీసం సీఎం అయినా ప్రెస్మీట్ పెట్టి కేంద్రాన్ని ఏం అడిగారో ఎందుకు చెప్పలేకపోతున్నారని నిలదీశారు.