భక్తిశ్రద్ధలతో సంకష్టహర చవితి పూజలు
ABN , First Publish Date - 2021-10-25T05:06:48+05:30 IST
జిల్లా వ్యాప్తంగా ఆశ్వీజ మాస సంకష్టహర చవితి పూజలు ఆదివారం భక్తి శ్రద్ధలతో సాగా యి. ఉదయం గణపతి ఆలయాల్లో మూల విగ్ర హాలకు పంచామృత అభిషేకాలు, ప్రత్యేక అర్చన లు నిర్వహించారు.
నిజామాబాద్ కల్చరల్, అక్టోబరు 24: జిల్లా వ్యాప్తంగా ఆశ్వీజ మాస సంకష్టహర చవితి పూజలు ఆదివారం భక్తి శ్రద్ధలతో సాగా యి. ఉదయం గణపతి ఆలయాల్లో మూల విగ్ర హాలకు పంచామృత అభిషేకాలు, ప్రత్యేక అర్చన లు నిర్వహించారు. పలు ఆలయాల్లో విఘ్నేశ్వరుడికి ప్రీతికరమైన మోదకాలతో కరోనా వ్యాధి నివారణకై హోమాన్ని జరిపారు. వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య గణపతి ఆధర్వణ శీర్షం, గణపతి నామాలతో హోమం చేశారు. సా యంత్రం భక్తులు భౌతికదూరాన్ని పాటిస్తూ సా మూహిక సంకష్టహర పూజలు జరిపారు. నగర ంలోని సార్వజనిక్ గణేష్ ఆలయంలో జరిగిన సంకష్ట పూజలో పండితులు పశుపతి శర్మ వేదమంత్రాలు పఠించగా అర్చకులు రఘు శర్మ పూ జలు చేశారు. రఘునాథ చెరువు సమీపంలో గల మహాగణపతి ఆలయంలో అర్చకులు రాజుశర్మ, భూషణ్చారి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మపురిలోని వర సిద్ధివినాయక ఆలయంలో, పద్మనగర్లోని వరసిద్ధి వినాయక ఆలయంలో, న్యూహౌజింగ్ బోర్డు కాలనీ మహాగణపతి ఆలయంలో ఆలయ అర్చకులు పుణ్యవర్ధన్ శర్మ, బోర్గాంలోని లక్ష్మిగణపతి ఆలయాల్లో చవితి పూజలు ఘనంగా నిర్వహించారు.