ఫుల్ కిక్... మూడు రోజుల్లో రూ.675 కోట్ల మద్యం విక్రయం
ABN , First Publish Date - 2022-01-17T13:19:32+05:30 IST
పొంగల్ సందర్భంగా ప్రభుత్వ నిర్వహణలోని టాస్మాక్ దుకాణాల్లో ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు రూ.675 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.540 కోట్ల ఆదాయం
- ప్రభుత్వానికి 540 కోట్ల ఆదాయం
ప్యారీస్(చెన్నై): పొంగల్ సందర్భంగా ప్రభుత్వ నిర్వహణలోని టాస్మాక్ దుకాణాల్లో ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు రూ.675 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.540 కోట్ల ఆదాయం గిట్టింది. టాస్మాక్ సంస్థ ఆధీనంలో వున్న చిల్లర దుకాణాలలో రోజువారీగా సుమారు రూ.100 కోట్ల మేర, సెలవు రోజుల్లో దీనికంటే రెండింతల విక్రయాలు జరుగుతుంటాయి. పొంగల్ పండుకు వరుస సెలవులు ప్రకటించడంతో మందుబాబులు ముందుగానే తమకు అవసరమైన మద్యం రకాలను కొనుగోలు చేశారు. ఈ ఏడాది తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా శనివారం, ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ కావడంతో మద్యం దుకాణాలు మందుబాబులు ముందుగానే సరకును కొనుగోలు చేసి తమ వద్ద వుంచుకున్నారు. పండుగ సీజన్లో అధిక మద్యం విక్రయించాలన్న లక్ష్యంతో గోదాముల నుంచి అన్ని టాస్మాక్ దుకాణాలకు భారీగా సరఫరా చేసింది. దీంతో 12వ తేదీన రూ.155 కోట్లు, 13న రూ.203 కోట్లు, 14న రూ.317 కోట్లు చొప్పున మొత్తం ఈ మూడు రోజుల్లో రూ.675 కోట్లు మద్యం విక్రయించింది.