ప్రయాణ వివరాలు పంచుకోవొద్దు

ABN , First Publish Date - 2021-01-14T06:54:29+05:30 IST

సంక్రాంతి పండగకు సొంత ఊర్లకు వెళ్లేవారు తమ ప్రయాణ వివరాలను సోషల్‌మీడియాలో పంచుకోవద్దని సీపీ అంజనీకుమార్‌ సూచించారు.

ప్రయాణ వివరాలు పంచుకోవొద్దు

హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌
హైదరాబాద్‌ సిటీ, జనవరి 13 (ఆంధ్రజ్యోతి):
సంక్రాంతి పండగకు సొంత ఊర్లకు వెళ్లేవారు తమ ప్రయాణ వివరాలను సోషల్‌మీడియాలో పంచుకోవద్దని సీపీ అంజనీకుమార్‌ సూచించారు. ఇలా చేయడంవల్ల ఇంట్లో ఎవరూ లేరని దొంగలకు తెలిస్తే, దొంగతనానికి ఇదే మంచి అవకాశంగా మార్చుకుంటారని హెచ్చ రించారు.  పండగ సమయంలో రాత్రి పూట గస్తీ పెంచామని, బ్లూకో ల్ట్స్‌, పెట్రోలింగ్‌ వాహనాలు, సిబ్బంది ఎక్కువ మంది అందుబాటులో ఉంటారని తెలిపారు. పండగలకు ఊళ్లకు వెళ్లేవారు తమ కాలనీ అసోసియేషన్లు, పోలీస్టేషన్‌లలో సమాచారమివ్వాలని కోరారు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరముందన్నారు. ీనేను సైతం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కెమెరాలు పనిచేస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆ కెమరాల విజువల్స్‌ను నిల్వచేసే స్టోరేజ్‌ ఉపకరణాలు పనిచేయడం లేదని ఇటీవల గుర్తించామన్నారు.  కెమెరాల స్టోరేజ్‌ ఉపకరణాలు పనిచేస్తున్నాయా లేదా అని తరచు గమనించాలని కోరారు. కెమెరాల ఏర్పాటు, నిర్వహణకు సంబంధించి సమస్యలు ఉంటే సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Updated Date - 2021-01-14T06:54:29+05:30 IST