సీఎస్‌కు జాయినింగ్‌ రిపోర్ట్‌ ఇచ్చిన కల్నల్‌ సంతోష్‌బాబు సతీమణి

ABN , First Publish Date - 2020-08-15T22:55:05+05:30 IST

ఇండో-చైనా సరిఽహద్దులో జరిగిన ఘటనలో ప్రాణాలను కోల్పోయిన కల్నల్‌ సంతోష్‌బాబు సతీమణి సంతోషి డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యలు స్వీకరించారు.

సీఎస్‌కు జాయినింగ్‌ రిపోర్ట్‌ ఇచ్చిన కల్నల్‌ సంతోష్‌బాబు సతీమణి

హైదరాబాద్‌: ఇండో-చైనా సరిఽహద్దులో జరిగిన ఘటనలో ప్రాణాలను కోల్పోయిన కల్నల్‌ సంతోష్‌బాబు సతీమణి సంతోషి డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యలు స్వీకరించారు. శనివారం ఆమె ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలిసి జాయినింగ్‌ రిపోర్ట్‌ ఇచ్చారు. సంతోషికి రెవెన్యూశాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్‌ ఇస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొన్నిరోజుల క్రితం ఆమెకు నియామక పత్రాన్నిఅందజేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కల్నల్‌సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. ఈనేపద్యంలో తాను విధుల్లోకి చేరడానికి శనివారం బిఆర్‌కె భవన్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను కలిసి జాయినింగ్‌రిపోర్ట్‌ ఇచ్చారు. 


Updated Date - 2020-08-15T22:55:05+05:30 IST