అమెరికాలో జడ్జిగా భారత సంతతి మహిళ

ABN , First Publish Date - 2020-02-22T14:56:13+05:30 IST

ప్రవాస భారతీయురాలు సరిత కోమటిరెడ్డి అమెరికాలో జడ్జిగా నియమితులు కానున్నారు.

అమెరికాలో జడ్జిగా భారత సంతతి మహిళ

వాషింగ్టన్: ప్రవాస భారతీయురాలు సరిత కోమటిరెడ్డి అమెరికాలో జడ్జిగా నియమితులు కానున్నారు. ఆమెను యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌ ఫర్‌ ది ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ న్యూయార్క్‌కు న్యాయమూర్తిగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నామినేట్‌ చేయనున్నారు. సరిత ప్రస్తుతం అమెరికా అటార్నీ కార్యాలయంలో ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ న్యూయార్క్‌కు సంబంధించి జనరల్‌ క్రైమ్స్‌ డిప్యూటీ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. సరిత.. ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీలో బీఏ చదివారు. అక్కడే మూడేళ్ల జ్యూరిస్‌ డాక్టర్‌ (జేడీ) ఫౌండేషన్‌ కోర్సు చేశారు.

Updated Date - 2020-02-22T14:56:13+05:30 IST