అధికారుల వేధింపులతో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-12-05T00:29:09+05:30 IST
అధికారుల వేధింపులకు నిరసనగా సర్పంచ్
సూర్యాపేట: అధికారుల వేధింపులకు నిరసనగా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం చేసింది. చింతలపాలెం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో అడ్లూరు సర్పంచ్ కందుకూరు స్వాతి, భర్త వెంకటేశ్వర్లు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు మంజూరు చెయ్యకుండా పంచాయతీ సెక్రెటరీ, ఎంపీడీఓ వేధింపులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ ఘటన మండలంలో సంచలనం సృష్టించింది.