మా సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లాలి
ABN , First Publish Date - 2021-11-29T05:38:47+05:30 IST
సర్పంచ్లు పడుతున్న ఇబ్బందులను, సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు కోరారు.
ఎంపీ మోపిదేవికి సర్పంచుల వినతి
తాడేపల్లి, నవంబరు 28: సర్పంచ్లు పడుతున్న ఇబ్బందులను, సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు కోరారు. ఈ మేరకు ఆదివారం రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణను ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందించారు. 14, 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీలలో తిరిగి జమ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నూతనంగా జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన రేపల్లె మండలం లంకవానిదిబ్బ సీనియర్ సర్పంచ్ చిలకలపూడి పాపారావును మోపిదేవి సత్కరించారు. అనంతరం ఎంపీ మోపిదేవిని సర్పంచ్లు సత్కరించి సమస్యల సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ పంచాయతీ పరిషత్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, సర్పంచ్లు ముప్పాళ్ల మనోహర్, తోకల సరోజిని, నరసింహరావు, చందు వెంకటసాంబశివరావు, కృష్ణమోహన్, మేకతోటి శ్రీకాంత్, అమరజ్యోతి సురేష్, రత్నకుమారి, డాక్టర్ ప్రీతి, రమాదేవి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.