సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-05-07T10:11:01+05:30 IST

కొత్తగా సర్పంచ్‌లుగా గెలుపొందిన వారికి వెంటనే చెక్‌ పవర్‌ కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు

సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ ఇవ్వాలి

పంచాయతీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షులు వైవీబీ


అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): కొత్తగా సర్పంచ్‌లుగా గెలుపొందిన వారికి వెంటనే చెక్‌ పవర్‌ కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీఎ్‌ఫఎంఎస్‌ ఖాతా కింద ఉన్న గ్రామ పంచాయతీ నిధులు, 14, 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.3 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి తన సొంత అవసరాలకు వాడేసుకుందన్నారు. దీంతో కరోనా నివారణ చర్యలు చేపట్టలేక సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయారన్నారు. గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అవడంతో గ్రామీణులు కరోనా బారిన పడుతున్నారని వైవీబీ ఆరోపించారు. 

Updated Date - 2021-05-07T10:11:01+05:30 IST