న్యూఢిల్లీలో రిపబ్లిక్డే పరేడ్కు సర్వోదయ విద్యార్థులు ఎంపిక
ABN , First Publish Date - 2022-01-25T04:25:25+05:30 IST
న్యూఢిల్లీలో జనవరి 26వ తేదీన జరిగే రిపబ్లిక్ డే పరేడ్కు నెల్లూరు నగరంలోని శ్రీ సర్వోదయ కళాశాలలో బీఏ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఎం.దివాకర్, అబ్దుల్ రహీంలు ఎంపికైనట్లు కరస్పాండెంట్ ఎ.రాధాకృష్ణయ్య సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
నెల్లూరు(విద్య), జనవరి 24 : న్యూఢిల్లీలో జనవరి 26వ తేదీన జరిగే రిపబ్లిక్ డే పరేడ్కు నెల్లూరు నగరంలోని శ్రీ సర్వోదయ కళాశాలలో బీఏ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఎం.దివాకర్, అబ్దుల్ రహీంలు ఎంపికైనట్లు కరస్పాండెంట్ ఎ.రాధాకృష్ణయ్య సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ, తెలంగాణా ఎన్సీసీ డైరెక్టరేట్ టీమ్లో వీరు ప్రదర్శనలో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్ డాక్టర్ సీవీ.సురేష్, వైస్ ప్రిన్సిపాల్ ఎం.పిచ్చయ్య, ఏఎన్వో ఎన్.సందీప్, ఎన్సీసీ కమాండింగ్ అధికారి వినయ్ రామచంద్రన్ అభినందించారు.