వైవీయూను సందర్శించిన సతీష్చంద్ర
ABN , First Publish Date - 2020-07-09T12:10:54+05:30 IST
యోగివేమన విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఉన్నత విద్య ప్రత్యేక కార్యదర్శి స..
కడప (వైవీయూ), జూలై 8: యోగివేమన విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఉన్నత విద్య ప్రత్యేక కార్యదర్శి సతీష్చంద్ర, ఉన్నత విద్యామండలి చైౖర్మన్ హేమచంద్రారెడ్డి బుధవారం పరిశీలించారు. నిర్మాణదశలో ఉన్న పరిపాలన భవనం అందంగా తయారయ్యేలా చూడాలని ఇంజనీర్లకు ఆదేశించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ విజయరాఘవప్రసాద్, ప్రిన్సిపల్ సాంబశివారెడ్డి వైవీయూలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వారికి వివరించారు.
అనంతరం ఆర్ట్స్ బ్లాక్, ఇతర భవనాలను పరిశీలించారు. సైన్స్ భవనంలో అధ్యాపకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సతీ్షచంద్ర మాట్లాడుతూ కరోనా సమస్యలతో విద్యారంగం ప్రమాదంలో పడిపోతోందని ఆన్లైన్ బోధన కొనసాగించాలని అన్నారు. విద్యార్థులకు ఆన్లైన్ బోధనకు తగ్గ పరికరాలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. గ్రామీణ విద్యార్థులకు బోధించేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించేలా చూడాలన్నారు. హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు.