నేడు 12 గ్రామాల్లో సత్యాగ్రహ దీక్షలు

ABN , First Publish Date - 2020-06-05T11:15:39+05:30 IST

బూరుగుపూడి ఆవ ముంపు ప్రాంతంలో ప్రభుత్వం ఇళ్ల స్థలాల సేకరణకు నిరసనగా కోరుకొండ, సీతానగరం ..

నేడు 12 గ్రామాల్లో సత్యాగ్రహ దీక్షలు

కోరుకొండ, జూన్‌ 4: బూరుగుపూడి ఆవ ముంపు ప్రాంతంలో ప్రభుత్వం ఇళ్ల స్థలాల సేకరణకు నిరసనగా  కోరుకొండ, సీతానగరం మండలాల్లోని 12 గ్రామాల్లోని ప్రజలు శుక్రవారం  ఉదయం 9 నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు సత్యాగ్రహ దీక్షలు చేపట్టనున్నట్టు అఖిలపక్ష నేతలు ప్రకటించారు. గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో బీజేపీ జోనల్‌ ఇన్‌చార్జి ఏపీఆర్‌ చౌదరి మాట్లాడుతూ ఇటీ వల జేఎన్టీయూకే ఇంజనీరింగ్‌ నిపుణులు తీసిన మట్టి నమూనాల సేకరణ తప్పన్నారు.


భవిష్యత్తులో తమ ఉద్యమాన్ని ఆవ ముంపు సమస్యతో సతమతమయ్యే 22 గ్రామాలకు విస్తరిస్తామన్నారు. సమావేశంలో అఖిలపక్ష సమన్వయ కమిటీ కన్వీనర్‌ అడపా శ్రీనివాస్‌, టీడీపీ నేతలు నాగా రమేష్‌, మారిశెట్టి రమణ, పరస శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ నేతలు గరగ శ్రీధర్‌బాబు, కర్రి వీరగణేష్‌, జనసేన నాయకులు అడబాల వీరవెంకటసత్యనారాయణ, బదిరెడ్డి దొర, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకుడు ప్రదీప్‌నాయుడు పాల్గొన్నారు

Updated Date - 2020-06-05T11:15:39+05:30 IST