సౌదీలో ఫైనల్ ఎగ్జిట్ వీసాల గడువు పొడిగింపు
ABN , First Publish Date - 2020-10-18T12:56:44+05:30 IST
సౌదీ అరేబియా వలసదారులకు సంబంధించి ఎగ్జిట్ వీసాల గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించింది.
రియాధ్: సౌదీ అరేబియా వలసదారులకు సంబంధించి ఎగ్జిట్ వీసాల గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించింది. దీనికి ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని సౌదీ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ పేర్కొంది. అలాగే అందరికీ ఆటోమేటిక్గా ఈ పొడిగింపు యాడ్ అవుతుందని, కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సౌదీ తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు 28,884 మంది వలసదారులకు లబ్ది చేకూరనుంది. కాగా, మార్చిలో దేశవ్యాప్తంగా మహమ్మారి ప్రభావం మొదలు కావడంతో సౌదీ అరేబియా అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. దీంతో వేలాది మంది వలసదారులు సౌదీలోనే చిక్కుకుపోయారు. వీరి కష్టాలను దృష్టిలో పెట్టుకుని తాజాగా సౌదీ అరేబియా ఈ నిర్ణయం తీసుకుంది.