సౌదీలో ఆగ‌ని కోవిడ్ క‌ల్లోలం.. ఒక్క‌రోజే..

ABN , First Publish Date - 2020-07-05T14:36:07+05:30 IST

సౌదీ అరేబియాలో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ క‌ల్లోలం కొన‌సాగుతోంది. అంత‌కంత‌కు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.

సౌదీలో ఆగ‌ని కోవిడ్ క‌ల్లోలం.. ఒక్క‌రోజే..

రియాద్: సౌదీ అరేబియాలో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ క‌ల్లోలం కొన‌సాగుతోంది. అంత‌కంత‌కు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే రెండు ల‌క్ష‌ల మార్కును దాటేశాయి. శ‌నివారం కూడా 4,128 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. మ‌రో 56 మంది మ‌ర‌ణించ‌గా... 2,642 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యార‌ని సౌదీ ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశ‌వ్యాప్తంగా ఈ వైర‌స్ సోకిన వారు 205,929 మంది ఉంటే... 143,256 మంది కోలుకున్నారు. కాగా, ఇప్ప‌టివ‌ర‌కు సౌదీ వ్యాప్తంగా 1,858 మందిని ఈ మ‌హ‌మ్మారి బ‌లిగొంది. ఇదిలా ఉంటే... ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌ర‌ణ‌ మృదంగం మోగిస్తున్న కోవిడ్‌-19 ఇప్ప‌టికే 5.30 ల‌క్ష‌ల మందిని క‌బ‌ళించింది. మొత్తం కోటి 13ల‌క్ష‌ల మందికి ప్ర‌బ‌లింది.   

Updated Date - 2020-07-05T14:36:07+05:30 IST