ఈసారి కూడా సౌదీ వాసులకే హజ్యాత్ర!
ABN , First Publish Date - 2021-06-13T13:42:20+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది హజ్యాత్రకు 60వేల మందినే అనుమతిస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాదిమాదిరిగా ఈ ఏడాది కూడా సౌదీలో నివసించేవారిని మాత్రమే అనుమతిస్తారు.
దుబాయ్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది హజ్యాత్రకు 60వేల మందినే అనుమతిస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాదిమాదిరిగా ఈ ఏడాది కూడా సౌదీలో నివసించేవారిని మాత్రమే అనుమతిస్తారు. యాత్రకు వెళ్లేవారు తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేసుకొని ఉండాలని సౌదీ హజ్ మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ సౌదీ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది. కరోనా కారణంగా గత సంవత్సరం ఈ యాత్రకు సౌదీలో నివసించే వెయ్యి మందిని మాత్రమే అనుమతించారు.