సాగునీటి పొదుపుతో అధిక దిగుబడులు

ABN , First Publish Date - 2021-06-23T05:28:22+05:30 IST

సాగునీటిని పొదుపుగా వాడి అధిక దిగుబడలు సాధిస్తామని రంగాపురం గాజులగొయ్యి చెరువు ఆయకట్టు రైతులు ప్రతిజ్ఞ చేశారు.

సాగునీటి పొదుపుతో అధిక దిగుబడులు

బిక్కవోలు, జూన్‌ 22: సాగునీటిని పొదుపుగా వాడి అధిక దిగుబడలు సాధిస్తామని రంగాపురం గాజులగొయ్యి చెరువు ఆయకట్టు రైతులు ప్రతిజ్ఞ చేశారు. ఇళ్లపల్లిలోని శ్రీవిఘ్నేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా మంగళవారం ఈ చెరువుకు నీటిని విడుదల చేశారు. ఎత్తిపోతల పథకం అధ్యక్షుడు పుట్టా సోమన్నచౌదరి ఆయకట్టు రైతులతో ఈ ప్రతిజ్ఞ చేయించి నీటి పొదుపు ఆవ శ్యకతను వివరించారు. ప్రస్తుతం 80 ఎకరాలకు ఈ చెరువు నీరు అందుతుందని, మరింత అభివృద్ధి చేస్తే మరో 50 ఎకరాలకు అదనంగా నీరు అందు తుందని రైతులకు చెప్పారు. ఎత్తిపోతల డైరెక్టర్లు చీకట్ల భీమరాజు, పొట్రు వాడపల్లి, పచ్చిగోళ్ల గోవిందరాజుగుప్తా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T05:28:22+05:30 IST