మరిన్ని ఏటీఎంలు ఏర్పాటు

ABN , First Publish Date - 2021-08-02T05:23:35+05:30 IST

ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు నగరంలో మరిన్ని ఏటీఎం కేంద్రాలను ప్రారంభిస్తామని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రాంతీయ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ అమిత్‌ జింగ్రాన్‌ పేర్కొన్నారు.

మరిన్ని ఏటీఎంలు ఏర్పాటు

ఎస్‌బీఐ రీజనల్‌ చీఫ్‌ మేనేజర్‌ అమిత్‌ జింగ్రాన్‌

పద్మారావునగర్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు నగరంలో మరిన్ని ఏటీఎం కేంద్రాలను ప్రారంభిస్తామని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రాంతీయ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ అమిత్‌ జింగ్రాన్‌ పేర్కొన్నారు. ఆదివారం పద్మారావునగర్‌లోని శ్రీస్కందగిరి ఆలయ ప్రాంగణంలో ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జనరల్‌ మేనేజర్‌ కృష్ణన్‌ శర్మ, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ దేబాశిష్‌ మిశ్రా, రీజనల్‌ మేనేజర్‌ సీవీ రఘురామ్‌, స్కందగిరి ఆలయ మేనేజింగ్‌ ట్రస్టీ కృష్ణన్‌ రాజమణి, పద్మారావునగర్‌ బ్రాంచి చీఫ్‌ మేనేజర్‌ కేఎ్‌సకే కామేశ్వరి పాల్గొన్నారు.

Updated Date - 2021-08-02T05:23:35+05:30 IST