కాగజ్‌నగర్‌లో దుర్గంధంగా ఎస్‌బీఐ ఏటీఎం

ABN , First Publish Date - 2022-01-22T04:17:09+05:30 IST

కాగజ్‌నగర్‌ స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏటీఎంను గుర్తు తెలియని వ్యక్తులు మరుగుదొడ్డిగా మార్చేశారు. శుక్రవారం ఏటీ ఎంలో చెత్తా చెదారంతో పాటు మల విసర్జన చేసి ఉన్న విషయాన్ని స్థానికులు మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. ఏటీఎం నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతోనే ఇష్టారాజ్యంగా చేస్తున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు.

కాగజ్‌నగర్‌లో దుర్గంధంగా ఎస్‌బీఐ ఏటీఎం
అపరిశుభ్రంగా మారిన ఏటీఎం

కాగజ్‌నగర్‌ టౌన్‌, జనవరి 21: కాగజ్‌నగర్‌ స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏటీఎంను గుర్తు తెలియని వ్యక్తులు మరుగుదొడ్డిగా మార్చేశారు. శుక్రవారం ఏటీ ఎంలో చెత్తా చెదారంతో పాటు మల విసర్జన చేసి ఉన్న విషయాన్ని స్థానికులు మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. ఏటీఎం నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతోనే ఇష్టారాజ్యంగా చేస్తున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు. ఈ విషయమై సీజీఎం ఆంఽథోనిని సంప్ర దించగా స్వీపర్‌ రాకపోవడంతోనే ఇలా జరిగిందని, ఏటీఎంలో మల, మూత్ర విసర్జన చేసిన వారిని సీసీ ఫుటేజ్‌ ఆధారంగా గుర్తించి చర్యలు చేపడతామని తెలిపారు.


Updated Date - 2022-01-22T04:17:09+05:30 IST