ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కొత్త లోగో
ABN , First Publish Date - 2020-07-02T01:27:07+05:30 IST
ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ నూతన లోగో, ట్యాగ్లైన్లను విడుదల చేసింది.
హైదరాబాద్: ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ నూతన లోగో, ట్యాగ్లైన్లను విడుదల చేసింది. డిజిటలైజేషన్లో ఎల్లప్పుడూ ముందుండే ఈ సంస్థ కొత్తగా డిజైన్ చేసిన లోగో, ట్యాగ్లైన్లను బుధవారం వెల్లడించింది. ‘భద్రత, విశ్వాసం రెండూ’ అనే ట్యాగ్లైన్తో తమ నూతన లోగోను ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఖాతాదారులకు సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామనే సంసిద్ధతను ఈ లోగో తెలియజేస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దీనిపై ఎస్బీఐ గ్లోబల్ బ్యాంకింగ్ అండ్ సబ్సిడరీస్ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కుమార్ ఖారా మాట్లాడారు. ‘భారతదేశంలోని చాలామంది ప్రజల జీవితాల్లో మా కంపెనీ ఓ భాగం. జాతి నిర్మాణం కోసం మేం ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటాం. ఖాతాదారులు మెరుగైన సేవలు అందించేందుకు శ్రమిస్తూనే ఉంటాం’ అని తెలిపారు.