రోజుకి రూ.లక్ష

ABN , First Publish Date - 2020-10-28T08:10:02+05:30 IST

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండి యా (ఎస్‌బీఐ) తమ ఖాతాదారులకు విభిన్న శ్రేణుల డెబిట్‌ కార్డులపై రోజువారీ ఏటీఎం విత్‌డ్రాయల్‌ పరిమితిని గణనీయంగా పెంచింది...

రోజుకి రూ.లక్ష

  • విత్‌డ్రాయల్‌ పరిమితి పెంచిన ఎస్‌బీఐ

న్యూఢిల్లీ : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండి యా (ఎస్‌బీఐ) తమ ఖాతాదారులకు విభిన్న శ్రేణుల డెబిట్‌ కార్డులపై రోజువారీ ఏటీఎం విత్‌డ్రాయల్‌ పరిమితిని గణనీయంగా పెంచింది. ఇప్పటివరకు వివిధ కార్డులపై రోజుకి రూ.10 వేల వరకు మాత్రమే గరిష్ఠంగా ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు రోజకి రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. వివిధ కార్డులకు ఈ పరిమితి విభిన్నంగా ఉంటుంది. ఎస్‌బీఐ క్లాసిక్‌, మేస్ర్టో డెబిట్‌ కార్డుపై రూ.20 వేల నుంచి ఎస్‌బీఐ ప్లాటినం ఇంటర్నేషనల్‌ డెబిట్‌ కార్డుపై రూ.లక్షకు రోజువారీ  విత్‌డ్రాయల్‌ పరిమితిని పెంచింది.

Updated Date - 2020-10-28T08:10:02+05:30 IST