ఎస్బీఐ ధమాకా ఆఫర్..! హోం లోన్స్పై...
ABN , First Publish Date - 2021-08-01T23:44:35+05:30 IST
దేశ ప్రజల సొంతింటి కల నేరవేర్చేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా బంపర్ ఆఫర్ ప్రకటించింది.
ముంబై: దేశ ప్రజల సొంతింటి కల నేరవేర్చేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. హోం లోన్స్పై ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆగస్టు 31 వరకూ ఈ అఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. మాన్సూన్ ధమాకా పేరిట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆఫర్ను ప్రకటించింది. అంతేకాకుండా..యోనో యాప్ ద్వారా లోన్కు దరఖాస్తు చేసుకున్న వారికి, మహిళలకు వడ్డీ రేటులో 5 బేసిస్ పాయింట్ల చొప్పున రాయితీ ఇస్తున్నట్టు కూడా ప్రకటించింది.