గోడిలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై డీఎస్పీ విచారణ

ABN , First Publish Date - 2021-01-21T06:36:51+05:30 IST

గోడిలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై డీఎస్పీ విచారణ చేపట్టారు. సంక్రాంతి సందర్భంగా గోడిలో దేవస్థానం భూమిలో కోడిపందేల బరి ఏర్పాటు విషయమై టీడీపీ నాయకుడు దెందుకూరి సత్యనారాయణరాజు, వైసీపీ నాయకుడు బొమ్మి ఇజ్రాయిల్‌ మధ్య గొడవ జరిగింది.

గోడిలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై డీఎస్పీ విచారణ

అల్లవరం, జనవరి 20: గోడిలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై డీఎస్పీ విచారణ చేపట్టారు. సంక్రాంతి సందర్భంగా గోడిలో దేవస్థానం భూమిలో కోడిపందేల బరి ఏర్పాటు విషయమై టీడీపీ నాయకుడు దెందుకూరి సత్యనారాయణరాజు,  వైసీపీ నాయకుడు బొమ్మి ఇజ్రాయిల్‌ మధ్య గొడవ జరిగింది. తనను కులం పేరుతో సత్యనారాయణరాజు దూషించాడని ఇజ్రాయిల్‌ ఫిర్యాదు చేశాడు. ఈ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై డీఎస్పీ వై.మాధవరెడ్డి గ్రామంలో విచారణ నిర్వహించారు.  అమలాపురం రూరల్‌ సీఐ సురేష్‌బాబు, అల్లవరం ఎస్‌ఐ బి.ప్రభాకరరావు పాల్గొన్నారు.  

Updated Date - 2021-01-21T06:36:51+05:30 IST