వైసీపీ మండల అధ్యక్షుడిపై అట్రాసిటీ కేసు

ABN , First Publish Date - 2020-12-04T05:49:25+05:30 IST

దళిత మహిళ ఫిర్యాదు మేరకు వైసీపీ మండల అధ్యక్షుడు గొర్లి సూరిబాబుపై రూరల్‌ పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

వైసీపీ మండల అధ్యక్షుడిపై అట్రాసిటీ కేసు

అనకాపల్లి టౌన్‌, డిసెంబరు 3: దళిత మహిళ ఫిర్యాదు మేరకు వైసీపీ మండల అధ్యక్షుడు గొర్లి సూరిబాబుపై రూరల్‌ పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఆలస్యంగా తెలిసిన ఈ కేసుకు సంబంధించి రూరల్‌ సీఐ పీవీవీ నరసింహారావు అందించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గొలగాం గ్రామానికి చెందిన దళితురాలు గంట్ల లక్ష్మి సర్వే నంబరు 88లో రేకులషెడ్డు వేసుకుని నివాసం ఉంటుంది. ఇంటి మరమ్మతు పనులు చేస్తుండగా అదే గ్రామానికి చెందిన దేముడు వచ్చి అభ్యంతరం తెలిపారు. పార్టీ మండల అధ్యక్షుడు గొర్లి సూరిబాబును కలిసిన తర్వాతే ఇంటి పనులు చేసుకోవాలని స్పష్టం చేశాడు. తన ఇంటి పని తాను చేసుకుంటానని చెప్పడంతో నవంబరు 23వ తేదీన వైసీపీ మండల అధ్యక్షుడు తన అనుచరులను పంపించి దౌర్జన్యం చేసి భయబ్రాంతులకు గురి చేశారని, వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని లక్ష్మి పోలీసులను కకోరారు. గత నెల 28న ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైసీపీ మండల అధ్యక్షుడు సూరిబాబుపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ కేసును డీఎస్పీ దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. 


Updated Date - 2020-12-04T05:49:25+05:30 IST