స్కాచ్‌ పురస్కార్‌కు భద్రాద్రి జిల్లా ఎంపిక

ABN , First Publish Date - 2020-12-05T05:07:38+05:30 IST

స్కాచ్‌ పురస్కార్‌కు భద్రాద్రి జిల్లా ఎంపిక

స్కాచ్‌ పురస్కార్‌కు భద్రాద్రి జిల్లా ఎంపిక

కరోనా నియంత్రణ అంశంలో నామినేట్‌ 

వివరాలు వెల్లడించిన కలెక్టర్‌ ఎంవీ రెడ్డి 

కొత్తగూడెం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కరోనా నియంత్రణ అంశంలో భద్రాద్రి కొత్త గూడెం జిల్లా.. దేశంలోనే అత్యున్నతమైన స్కాచ్‌ పురస్కార్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యింది. ఈ మేరకు కలెక్టర్‌ ఎంవీ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో వివరాలు వెల్లడిం చారు. కరోనా వైరస్‌ నియంత్రణకుగాను జిల్లాలో జరిగిన కృషిపై రూపొందించిన డాక్యు మెంట్‌ను స్కాచ్‌ కమిటీ చైర్మన్‌ దీపక్‌ దంజల్‌ పరిశీలించి.. జిల్లాను అవార్డుకు నామినేట్‌ చేశారన్నారు. ఈ క్రమంలో జిల్లాకు ఈ అవార్డు దక్కి.. దేశ స్థాయిలో కీర్తి పెంచాలంటే జిల్లా పౌరులు, ఇతర ప్రాంతాల్లోని మిత్రులు.. ‘భద్రం.. భద్రాద్రి’కి ఓట్లు వేయాల్సి ఉంటుందన్నారు. ఆన్‌లైన్‌లో ఈ ఓటింగ్‌ వివరాలను తెలియజేస్తూ పొందుపర్చిన లింక్‌ను ప్రజలకు అందజేస్తున్నామని, ప్రతీ ఒక్కరు ఈ లింక్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. శుక్రవారం నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు మాత్రమే ఓటింగ్‌ ప్రక్రియ ఉంటుందని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2020-12-05T05:07:38+05:30 IST