ఐసెట్ మూడో విడత కౌన్సెలింగ్కు నేడు షెడ్యూలు
ABN , First Publish Date - 2021-01-21T06:43:22+05:30 IST
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఐసెట్ మూడోవిడత కౌన్సెలింగ్కు ప్రభుత్వం గురువారం షెడ్యూలు విడుదల చేయనుంది. అనేక వర్సిటీల్లో వార్షిక బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలు ప్రకటించకముందే ఐసెట్
హైకోర్టు ఆదేశాలతో
ఉన్నత విద్యామండలి నిర్ణయం
హైదరాబాద్, జనవరి 20(ఆంధ్రజ్యోతి): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఐసెట్ మూడోవిడత కౌన్సెలింగ్కు ప్రభుత్వం గురువారం షెడ్యూలు విడుదల చేయనుంది. అనేక వర్సిటీల్లో వార్షిక బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలు ప్రకటించకముందే ఐసెట్ రెండు విడతల కౌన్సెలింగ్ను డిసెంబరు 24న ముగించారు. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఐసెట్ పరీక్షలో అర్హత సాధించినా.. కౌన్సెలింగ్లో పాల్గొనలేకపోయారు. ఎంబీఏలో 7,252 సీట్లు మిగిలిపోయాయని, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఐసెట్ మరోవిడత కౌన్సెలింగ్ చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. సాంకేతిక విద్యాశాఖ అంగీకరించకపోవడంతో.. వారు హైకోర్టును ఆశ్రయించారు. మరోవిడత కౌన్సిలింగ్ నిర్వహించాలని ఈనెల 19న హైకోర్టు ఆదేశించడంతో.. స్పందించిన ఉన్నత విద్యామండలి.. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను గురువారం ప్రకటించనున్నామని బుధవారం ఓప్రకటనలో తెలిపింది.