తెరుచుకున్న స్కూళ్లు... పూలతో విద్యార్థులకు స్వాగతం!

ABN , First Publish Date - 2021-08-16T16:36:42+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో నాలుగు నెలల అనంతరం ఈరోజు తిరిగి పాఠశాలలు...

తెరుచుకున్న స్కూళ్లు... పూలతో విద్యార్థులకు స్వాగతం!

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో నాలుగు నెలల అనంతరం ఈరోజు తిరిగి పాఠశాలలు తెరుచుకున్నాయి. ఇకపై 50 శాతం విద్యార్థుల సామర్థ్యంతో ఉపాధ్యాయులు తరగతులు నిర్వహించనున్నారు. అయితే థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ తరువాతనే విద్యార్థులను స్కూలులోకి అనుమతిస్తున్నారు. లక్నోలో స్కూళ్లకు హోజరవుతున్న విద్యార్థులకు పూలతో స్వాగతం పలికారు. అలాగే విద్యార్థులకు చాక్లెట్లు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు సోషల్ డిస్టెన్స్ పాటించేలా ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. ప్రస్తుతానికి 9 నుంచి 12 తరగతుల వరకూ చదివే విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తున్నారు. 


Updated Date - 2021-08-16T16:36:42+05:30 IST