పాఠశాలలను తనిఖీ చేసిన డీఈఓ
ABN , First Publish Date - 2020-12-04T04:11:53+05:30 IST
లక్షెట్టిపేట పట్టణంతో పాటు మండలంలోని పలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను డీఈఓ వెంకటేశ్వర్లు గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు.
లక్షెట్టిపేట, డిసెంబరు 3 : లక్షెట్టిపేట పట్టణంతో పాటు మండలంలోని పలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను డీఈఓ వెంకటేశ్వర్లు గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. లక్షెట్టిపేట పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల, మండలంలోని వెంకట్రావుపేట, దౌడేపల్లి, చందారం పాఠశాలలను తనిఖీ చేసిన అనంతరం ఆయా పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఆన్లైన్ తరగతుల విధానాన్ని పరిశీలించారు. అదే విధంగా ఆన్లైన్ క్లాసులలో పాల్గొంటున్న ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు రిజిష్టర్లను, విద్యార్థుల వీక్లీ రిపోర్టులను, వర్క్షీట్లను పరిశీలించారు. ఉపాధ్యాయులు ఆయా తరగతులకు సంబంధించి వాట్సప్ గ్రూపులను పరిశీలించి విద్యార్థులకు పాఠ్యాంశాలపై వారి స్పందనను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఆయా పాఠశాలల్లోని పరిసరాలను కూడా పరిశీలించి ఉపాధ్యాయులకు తగిన సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రవీందర్, ఆయా పాఠశాలల ప్రధానోపాద్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.