ఢిల్లీలో అక్టోబర్ 5 వరకు పాఠశాలల మూసివేత

ABN , First Publish Date - 2020-09-18T23:14:37+05:30 IST

ఢిల్లీలో అక్టోబర్ 5 వరకు పాఠశాలల మూసివేత

ఢిల్లీలో అక్టోబర్ 5 వరకు పాఠశాలల మూసివేత

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో పాఠశాలలు అక్టోబర్ 5 వరకు మూసివేయబతాయని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు అక్టోబర్ 5వ తేదీ వరకు మూసివేయనున్నట్లు ఢిల్లీ సర్కారు వెల్లడించింది. ఆన్‌లైన్ తరగతులు, బోధనా అభ్యాస కార్యకలాపాలు యాథావిధిగా కొనసాగుతాయని విద్యాశాఖ డైరెక్టరేట్ ఇచ్చిన ఉత్తర్వులో పేర్కొంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సజావుగా నిర్వహించడానికి అవసరమైన సిబ్బందిని పిలవడానికి అధికారం కలిగి ఉన్నారని, ఆన్‌లైన్ తరగతులు లేదా ఏదైనా ఇతర పని చేయడానికి అధికారం ఉంటుంది.

Updated Date - 2020-09-18T23:14:37+05:30 IST