ఏపీలో యథావిధిగా తెరుచుకున్న పాఠశాలలు
ABN , First Publish Date - 2022-01-17T19:25:26+05:30 IST
ఏపీలో సోమవారం నుంచి పాఠశాలలు యథావిధిగా తెరుచుకున్నాయి.
అమరావతి: సంక్రాంతి సెలవులు ముగియడంతో ఏపీలో సోమవారం నుంచి పాఠశాలలు యథావిధిగా తెరుచుకున్నాయి. తెలంగాణలో మాత్రం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించింది. ఏపీలో మాత్రం విద్యార్థులు ఖచ్చితంగా స్కూల్స్కు రావాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ పిల్లలను స్కూల్కు పంపకపోతే అమ్మఒడి డబ్బులు రావని బెదిరిస్తున్నారని, అందుకే భయపడి స్కూలుకు పంపిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇప్పటికే రెండుళ్లుగా విద్యా విధానం డిస్టర్బ్ అయిందని, ఈ ఏడాది అలా కాకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యార్థులకు విద్యా బోధన జరుగుతుందని టీచర్స్ చెబుతున్నారు.