గల్లంతైౖన యువకుడి కోసం గాలింపు
ABN , First Publish Date - 2021-02-27T05:49:56+05:30 IST
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసం హరించుకోవాలని సీఐటీయూ నాయకుడు కృష్ణ, డీవైఎఫ్ఐ కార్యదర్శి మైన శుక్రవారం డిమాండ్ చేశారు
కౌతాళం, ఫిబ్రవరి 26: మండలంలోని మేళిగనూరు గ్రామంలో గురువారం సాయంత్రం తుంగభద్రలో స్నానానికి వెళ్ళిన యువకుడు గల్లంతయ్యాడు. వివరాల మేరకు.. నర్సప్ప, లక్ష్మి దంపతుల చిన్న కుమారుడు రామ(19) గొర్రెలను మేపేందుకు వెళ్ళేవాడు. గురువారం సాయంత్రం స్నేహితుడు వెంకటేష్తో కలిసి నదిలో ఈతకొట్టేందుకు వెళ్లి, మునిగిపోయాడు. సమాచారం అందుకున్న స్థానికులు గాలించినా ఆచూకీ లేదు. దీంతో శుక్రవారం పోలీసు అగ్నిమాపక, రెవెన్యూ అధికారులు చేరుకుని గజ ఈతగాళ్లను పిలిపించి గాలించారు. శుక్రవారం రాత్రి వరకు గాలించిన దొరకలేదని, శనివారం ఉదయం గాలింపు కొనసాగిస్తామని ఎస్ఐ నాగార్జున రెడ్డి తెలిపారు. డీటీ చంద్రశేఖర వర్మ రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.