సీజనల్వ్యాధుల నివారణకు పారిశుధ్య కార్యక్రమాలు
ABN , First Publish Date - 2020-06-29T10:31:58+05:30 IST
సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి ఆదివారం పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని రవాణా శాఖామంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు
ఖమ్మం కార్పొరేషన్, జూన్28: సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి ఆదివారం పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని రవాణా శాఖామంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు ఆదివారం నగరంలోని 31వ డివిజన్లో మేయర్ డాక్టర్. పాపాలాల్ మురుగు కాలువలను శుభ్రం చేశారు. 21వ డివిజన్ కార్పోరేటర్ కర్నాటి కృష్ణ కవిరాజ్నగర్ ప్రాంతంలోని 7,8,9 లైన్లలో ఇళ్లల్లోని పూలకుండీల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించి, శుభ్రంచేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఆర్టీవో కృష్నారెడ్డి, నూతలపాటి నాగేశ్వరరావు, సాయికృష్ణ, నూనె అరవింద్, ఎన్ఆర్ఎం మురళి, కొనకంచి సరళ పాల్గొన్నారు.