అయోధ్య భూమిపూజ: కలబురగిలో సెక్షన్ 144

ABN , First Publish Date - 2020-08-04T21:04:24+05:30 IST

ఈనెల 5వ తేదీన అయోధ్యలో భూమిపూజ జరుగనున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా కర్ణాటకలోని..

అయోధ్య భూమిపూజ: కలబురగిలో సెక్షన్ 144

బెంగళూరు: ఈనెల 5వ తేదీన అయోధ్యలో భూమిపూజ జరుగనున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా కర్ణాటకలోని కలబురగి సిటీలో పోలీసులు సెక్షన్ 144 విధించారు. ఆగస్టు 6వ తేదీ వరకూ ఇది అమల్లో ఉంటుంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 6వ తేదీ ఉదయం 6 గంటల వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని కలబురగి సిటీ పోలీస్ కమిషనర్ వికాస్ కుమార్ తెలిపారు.


అదేవిధంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా మంగళూరులో మంగళవారం సాయంత్రం 8 గంటల నుంచి 6వ తేదీ ఉదయం 6 గంటల వరకూ సెక్షన్ 144 అమలు చేస్తున్నట్టు కమిషనర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 5న అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధాని మోదీ భూమిపూజ చేస్తారు. 

Updated Date - 2020-08-04T21:04:24+05:30 IST