మెప్మా సీఆర్పీలను ఎన్నికలకు దూరంగా ఉంచండి: ఎస్‌ఈసీ

ABN , First Publish Date - 2021-03-08T10:27:18+05:30 IST

పట్టణాలు, నగరాల్లో మెప్మాలో పనిచేస్తున్న రీసోర్స్‌ పర్సన్స్‌, కమ్యూనిటీ రీసోర్స్‌ పర్సన్‌లను మున్సిపల్‌

మెప్మా సీఆర్పీలను ఎన్నికలకు దూరంగా ఉంచండి: ఎస్‌ఈసీ

అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): పట్టణాలు, నగరాల్లో మెప్మాలో పనిచేస్తున్న రీసోర్స్‌ పర్సన్స్‌, కమ్యూనిటీ రీసోర్స్‌ పర్సన్‌లను మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ అన్ని జిల్లా కలెక్టర్లను, మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. పలు జిల్లాల్లో వారు పార్టీల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారని ఫిర్యాదులొచ్చిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈసీ హెచ్చరించింది.

Updated Date - 2021-03-08T10:27:18+05:30 IST