ఎస్‌ఈసీ అప్పీల్‌పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం

ABN , First Publish Date - 2020-12-05T17:33:58+05:30 IST

హైదరాబాద్‌: స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ముద్రల ఓట్లపై... సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై హైకోర్టులో ఎస్‌ఈసీ అప్పీల్‌ చేసిన విషయం తెలిసిందే.

ఎస్‌ఈసీ అప్పీల్‌పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం

హైదరాబాద్‌: స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ముద్రల ఓట్లపై... సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై హైకోర్టులో ఎస్‌ఈసీ అప్పీల్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్‌ఈసీ అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఈ విచారణను నిర్వహించింది. సింగిల్‌ జడ్జి మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం వెల్లడించింది. నేరేడ్‌మెట్‌లో ఫలితం నిలిచిపోయిందని ఎస్‌ఈసీ కోర్టుకు తెలిపింది. సిబ్బందికి శిక్షణ లోపమే కారణమని హైకోర్టు అభిప్రాయపడింది. సింగిల్‌ జడ్జి వద్ద సోమవారం విచారణ ఉందని ధర్మాసనం వెల్లడించింది. అత్యవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. సింగిల్‌ జడ్జి వద్ద విచారణ పూర్తయ్యాక అభ్యంతరం ఉంటే.. అప్పీల్‌ చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తెలిపింది. 


Updated Date - 2020-12-05T17:33:58+05:30 IST