సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌గా అనూరాధ

ABN , First Publish Date - 2020-12-05T05:25:50+05:30 IST

కర్నూలు సెకండ్‌ క్లాస్‌ జ్యూడీషియల్‌ మేజిస్ట్రేట్‌ (ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌, అర్బన్‌, రూరల్‌)గా స్థానిక మహిళా న్యాయవాది బీటీ అనూరాధను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌గా అనూరాధ

కర్నూలు(లీగల్‌), డిసెంబరు 4: కర్నూలు సెకండ్‌ క్లాస్‌ జ్యూడీషియల్‌ మేజిస్ట్రేట్‌ (ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌, అర్బన్‌, రూరల్‌)గా స్థానిక మహిళా న్యాయవాది బీటీ అనూరాధను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆమె శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈమె ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు. ఈమె నియామకం పట్ల పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. 


ఇన్‌చార్జి ఏపీపీగా నాగముని

కర్నూలు 3వ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు ఇన్‌చార్జి అదనపు పీపీగా కర్నూలు నాలుగో అదనపు సెషన్స్‌ కోర్టులో పని చేస్తున్న నాగమునిని ఇన్‌చార్జిగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంతవరకు ఈ పదవిలో ఉన్న పి.మహమ్మద్‌ రఫీ పదవీ కాలం ముగియడంతో నాగమునిని ఇన్‌చార్జిగా తదుపరి ఉత్తర్వులు అందేవరకు నియమించారు.


Updated Date - 2020-12-05T05:25:50+05:30 IST