రేపటి నుంచి రెండో దశ కౌన్సెలింగ్
ABN , First Publish Date - 2021-11-24T13:54:45+05:30 IST
రేపటి నుంచి..
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లమో ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్(డైట్) కోర్సుల సీట్ల భర్తీకి రెండో దశ కౌన్సెలింగ్ను ఈ నెల 25 నుంచి నిర్వహించాలని నిర్ణయించారు. షెడ్యూల్ను డీఈఈ సెట్ కన్వీనర్ శ్రీనివాస చారి ప్రకటించారు. దీని ప్రకారం.. ఈ నెల 25న అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలి. 27 నుంచి 29 వరకూ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. డిసెంబరు 3న మెరిట్ ప్రకారం సీట్ల కేటాయింపు జాబితా ప్రకటిస్తారు. జాబితాలోని అభ్యర్థులు డిసెంబరు 6, 7 తేదీల్లో ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి.