మొతేరా టెస్టు: పంత్ ధమాకా.. సుందర్ పటాకా..

ABN , First Publish Date - 2021-03-05T22:51:12+05:30 IST

ఇండియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. రిషబ్ పంత్(101), వాషింగ్టన్ సుందర్(60 నాటౌట్) సూపర్ పార్ట్‌నర్‌షిప్‌తో టీమిండియా మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ..

మొతేరా టెస్టు: పంత్ ధమాకా.. సుందర్ పటాకా..

అహ్మదాబాద్: ఇండియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. రిషబ్ పంత్(101), వాషింగ్టన్ సుందర్(60 నాటౌట్) సూపర్ పార్ట్‌నర్‌షిప్‌తో టీమిండియా మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు 24/1తో రెండో రోజు ఆట మొదలు పెట్టిన టీమిండియా.. కొద్ది సేపటికే పుజారా(17) వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ క్రీజులో నిలదొక్కుకున్నట్లు కనిపించినా అర్థ సెంచరీకి కొద్ది దూరంలో 49 పరుగుల వద్ద స్టోక్స్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో తొలి రెండు సెషన్లు ఇంగ్లండ్‌ బౌలర్లదే పేచైయిగా మారింది. వరుస విరామాల్లో టీమిండియా వికెట్లు కోల్పోవడంతో ఒకానొక దశలో 146 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్, బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌లు ఇన్నింగ్స్‌ను అద్భుతంగా నడిపారు. వీరిద్దరూ కలిసి 113 పరుగులు జోడించారు. దీంతో టీమిండియా పటిష్ఠ స్థితికి చేరింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 294 పరుగులతో ఉంది.

Updated Date - 2021-03-05T22:51:12+05:30 IST