థాంప్సన్కు రెండో పసిడి
ABN , First Publish Date - 2021-08-04T09:19:29+05:30 IST
జమైకా చిరుత జామ్ థాంప్సన్ ఈ ఒలింపిక్స్లో రెండో స్వర్ణాన్ని దక్కించుకొంది. ఇప్పటికే మహిళల 100 మీటర్లలో స్వర్ణం నెగ్గిన థాంప్సన్...
జమైకా చిరుత జామ్ థాంప్సన్ ఈ ఒలింపిక్స్లో రెండో స్వర్ణాన్ని దక్కించుకొంది. ఇప్పటికే మహిళల 100 మీటర్లలో స్వర్ణం నెగ్గిన థాంప్సన్.. 200 మీటర్లలోనూ విజేతగా నిలిచింది. ఫైనల్ రేసును థాంప్సన్ 21.53 సెకన్లలో రేసును పూర్తి చేసి పసిడి అందుకుంది. ఎంబోమా క్రిస్టీన్ (నమిబియా) రజత, థామస్ గాబ్రిల్లా (అమెరికా) కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు.