మలి దశ కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కోవాలి: జేసీ

ABN , First Publish Date - 2020-12-04T04:31:50+05:30 IST

మలిదశ కొవిడ్‌ మరింత ప్రమాదకరమనే హెచ్చరికల నేపథ్యంలో దానిని సమర్థంగా ఎదుర్కోవాలని జేసీ-2 గోవిందరావు సూచించారు.

మలి దశ కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కోవాలి: జేసీ
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న జేసీ-2 గోవిందరావు

సబ్బవరం, డిసెంబరు 3: మలిదశ కొవిడ్‌ మరింత ప్రమాదకరమనే హెచ్చరికల నేపథ్యంలో దానిని సమర్థంగా ఎదుర్కోవాలని జేసీ-2 గోవిందరావు సూచించారు. ఎంపీ డీవో కార్యాలయంలో గురువారం ఆయన అధికారులు, సచివాలయ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాఖల మధ్య సమన్వయంతో అధికారులు బాధ్యతగా పనిచేసి, సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్‌నా యుడు, ఏవో షేక్‌బాబూరావు, ఈవోపీఆర్‌డీ ప్రేమసాగర్‌, హౌసింగ్‌ ఏఈ నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-04T04:31:50+05:30 IST