సచివాలయ నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలి: కేసీఆర్

ABN , First Publish Date - 2021-12-10T01:13:35+05:30 IST

సచివాలయ నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న సచివాలయ పనుల తీరుతెన్నులను

సచివాలయ నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలి: కేసీఆర్

హైదరాబాద్: సచివాలయ నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న సచివాలయ పనుల తీరుతెన్నులను గురువారం కేసీఆర్ పరిశీలించారు. వేగవంతంగా జరుగుతున్న పనుల పురోగతిపై  సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేస్తున్న రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, అధికారులను కేసీఆర్ అభినందించారు. నాణ్యత విషయంలో రాజీపడొద్దని ఆదేశించారు. దేశం గర్వించేలా సచివాలయ నిర్మాణం ఉండాలన్నారు. ఇతర రాష్ట్రాల్లోని సచివాలయ నిర్మాణాలను పరిశీలించాలని సూచించారు. ఎలివేషన్‌, ఫైనల్‌ వర్క్‌పై అధికారులకు కేసీఆర్ సూచనలు చేశారు.

Updated Date - 2021-12-10T01:13:35+05:30 IST