సచివాలయ ఉద్యోగి ఆకస్మిక మృతి
ABN , First Publish Date - 2021-08-02T06:19:49+05:30 IST
మండలంలోని పెద్దమల్లేపల్లికి చెం దిన గ్రామ సచివాలయ సర్వేయర్ గణేష్ శనివారం సాయం త్రం ఆకస్మికంగా మృతి చెందాడు.
స్నేహితుడి బర్త్డే వేడుకల నుంచి వచ్చిన గంటలోపే ఘటన
యల్లనూరు, ఆగస్టు 1: మండలంలోని పెద్దమల్లేపల్లికి చెం దిన గ్రామ సచివాలయ సర్వేయర్ గణేష్ శనివారం సాయం త్రం ఆకస్మికంగా మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలి వి. వ్యవసాయదారుడైన శేఖర్కు గణే్షతో పాటు ఇరువురు కు మార్తెలు ఉన్నారు. బీటెక్ పూర్తిచేసిన గణేష్ యాడికి మండలం గుడిపాడు గ్రామ సచివాలయంలోసర్వేయర్గా పనిచేస్తున్నాడు. స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు గుడిపాడులో విధులు ముగించుకొని సాయంత్రం కేక్తో పాటు స్వగ్రామమైన పెద్దమల్లేపల్లికి వచ్చాడు. పుట్టినరోజు వేడుకలు ముగించుకొని ఇంటికి వచ్చిన గణేష్... స్నానానికి వెళ్లి బయటకు వస్తూ ఊపిరి ఆడడం లేదని ఇబ్బంది గా ఉందంటూ కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందినట్లు తెలిపారు.
సచివాలయ ఉద్యోగుల దిగ్ర్భాంతి
విధులకు వచ్చి వెళ్లిన తమ తోటి సచివాలయ ఉద్యోగి గణేష్ ఆకస్మికంగా మృతిచెందాడన్న వార్త తెలుసుకున్న గుడిపాడు సచివాలయ ఉద్యోగులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. గుడిపాడు పంచాయతీ కార్యదర్శి అరుణ్కుమార్, పలువురు సచివాలయ ఉద్యోగులు గణేష్ మృతదేహం వద్ద నివాళులర్పించారు.