సచివాలయం నిర్మాణాలను వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2021-06-20T04:58:35+05:30 IST
మండల వ్యాప్తం గా సచివాలయం నిర్మాణాలను వేగవంతం చేయాలని జేసీ సాయికాంత్వర్మ అధికారులకు తెలియజేశారు.
సంబేపల్లె, జూన్19: మండల వ్యాప్తం గా సచివాలయం నిర్మాణాలను వేగవంతం చేయాలని జేసీ సాయికాంత్వర్మ అధికారులకు తెలియజేశారు. శనివారం నిర్మాణంలో ఉన్న నారాయణరెడ్డిపల్లె సచివాలయాన్ని ఆయన సందర్శించారు. పనులకు సంబంధించి పలు సూచనలు, సలహాలను ఇంజనీరింగ్ అధికారులకు తెలియజేశారు. మండల వ్యాప్తంగా సచివాలయం నిర్మాణాలు పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నరసింహులు, తహసీల్దార్ నరసింహులు, ఇంజనీరింగ్ డిపార్టుమెంట్ పంచాయతీ కార్యదర్శులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.