సచివాలయాలను బలోపేతం చేయాలి

ABN , First Publish Date - 2020-05-31T11:28:22+05:30 IST

గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందించాల్సిన సేవలను పారదర్శకంగా, వేగవంతంగా అందించి

సచివాలయాలను బలోపేతం చేయాలి

జేసీ సాయికాంత్‌వర్మ


కడప రూరల్‌, మే 30 : గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందించాల్సిన సేవలను పారదర్శకంగా, వేగవంతంగా అందించి మరింతగా బలోపేతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.సాయికాంత్‌ వర్మ తెలిపారు. జడ్పీ సమావేశ హాలులో శనివారం రాజంపేట డివిజన్‌ పరిధిలోని సచివాలయాల్లో పనిచేసే డిజిటల్‌ అసిస్టెంట్స్‌కు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చిందన్నారు.


ఈ వ్యవస్థ ద్వారా 509 రకాల సేవలు ప్రజలకు అందిస్తున్నామన్నారు. ఇందులో ముఖ్యమైన సేవలకు సంబంధించి డిజిటల్‌ అసిస్టెంట్స్‌కు శిక్షణను ఇస్తున్నామన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ లక్ష్యసాధనకు పాటుపడాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డి, డీపీవో ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సీఈవో ఆర్‌.నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-31T11:28:22+05:30 IST