special train: సికింద్రాబాద్-మదురై మధ్య ప్రత్యేక రైలు
ABN , First Publish Date - 2022-07-26T16:11:46+05:30 IST
సికింద్రాబాద్-మదురై జంక్షన్ మధ్య ప్రత్యేక రైళ్లు(special train) నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నెం.07191 సికింద్రాబాద్-మదురై
ఐసిఎఫ్(చెన్నై), జూలై 25: సికింద్రాబాద్-మదురై జంక్షన్ మధ్య ప్రత్యేక రైళ్లు(special train) నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నెం.07191 సికింద్రాబాద్-మదురై వారాంతపు ప్రత్యేక రైలు ఆగస్టు 1,8,15,22 (సోమవారం) తేదీల్లో రాత్రి 9.25 గంటలకు సికింద్రాబాద్(Secunderabad)లో బయల్దేరి మరుసటిరోజు రాత్రి 8.45 గంటలకు మదురై జంక్షన్ చేరుకుంటుంది. అలాగే, నెం.07192 మదురై జంక్షన్-సికింద్రాబాద్ వారాంతపు ప్రత్యేక రైలు ఆగస్టు 3,10,17,24 (బుధవారం) తేదీల్లో సాయంత్రం 5.30 గంటలకు మదురై జంక్షన్(Madurai Junction)లో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 7.25 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైళ్ల ముందస్తు రిజర్వేషన్ మంగళవారం నుంచి ప్రారంభమవుతుందని దక్షిణ రైల్వే తెలియజేసింది.