Train: సికింద్రాబాద్ - మదురై వీక్లీ ఎక్స్ప్రెస్ పొడిగింపు
ABN , First Publish Date - 2022-08-23T15:25:39+05:30 IST
సికింద్రాబాద్ - మదురై - సికింద్రాబాద్(Secunderabad - Madurai - Secunderabad) వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైళ్లను సెప్టెంబరు 26వ తేదీ వరకు
చెన్నై, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్ - మదురై - సికింద్రాబాద్(Secunderabad - Madurai - Secunderabad) వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైళ్లను సెప్టెంబరు 26వ తేదీ వరకు పొడిగిస్తూ దక్షిణ రైల్వే సోమవారం ప్రకటన విడుదల చేసింది. సికింద్రాబాద్ - మదురై వీక్లీ ఎక్స్ప్రెస్ (07191) ప్రతి సోమవారం రాత్రి 9.25 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8.45 గంటలకు మదురై(Madurai) చేరుకుంటుంది. ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 26వ తేదీ వరకు ఈ రైలును పొడిగించారు. అదే విధంగా మదురై - సికింద్రాబాద్ వీక్లీ ఎక్స్ప్రెస్ (07192) ప్రతి బుధవారం ఉదయం 5.30 గంటలకు మదురైలో బయలుదేరి మరునాడు ఉదయం 7.25 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలును సెప్టెంబరు 28వ తేదీ వరకు పొడిగించారు.