37 మంది స్కూలు పిల్లలపై కత్తితో దాడి చేసిన సెక్యూరిటీ గార్డ్.. చైనాలో..

ABN , First Publish Date - 2020-06-04T21:10:13+05:30 IST

స్కూలు సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న వ్యక్తి 37 మంది పిల్లలపై, ఇద్దరు

37 మంది స్కూలు పిల్లలపై కత్తితో దాడి చేసిన సెక్యూరిటీ గార్డ్.. చైనాలో..

బీజింగ్: స్కూలు సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న వ్యక్తి 37 మంది పిల్లలపై, ఇద్దరు టీచర్లపై కత్తితో దాడి చేశాడు. చైనాలోని గ్వాంగ్జీ రీజియన్‌లో ఈ విషాధ సంఘటన చోటుచేసుకుంది. వాంగ్‌ఫూ సెంట్రల్ ప్రైమరీ స్కూల్‌లో గురువారం ఉదయం 8.30 గంటలకు ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు. విద్యార్థులు స్కూలుకు వచ్చిన కాసేపటికే ఈ దాడి జరిగినట్టు పేర్కొన్నారు. విద్యార్థులకు స్వల్ప గాయాలే కావడంతో 37 మంది కూడా సురక్షితంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మరోపక్క ఇద్దరు టీచర్లకు కత్తి దాడిలో తీవ్ర గాయాలయ్యాయని.. అయితే ప్రాణాపాయస్థితిలో లేరని వైద్యులు చెప్పారు. సెక్యూరిటీ గార్డ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. 50ల వయసున్న నిందితుడు ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. గతంలోనూ చైనాలో ఇటువంటి సంఘటనలు చాలానే జరిగినట్టు తెలుస్తోంది. కాగా.. చైనాలో లాక్‌డౌన్ నేపథ్యంలో చాలా నెలల తరువాత మే నెలలోనే స్కూళ్లు తెరుచుకున్నాయి. 

Updated Date - 2020-06-04T21:10:13+05:30 IST