రాజులను ఎలా గౌరవించేవారో గమనించండి
ABN , First Publish Date - 2021-06-25T11:37:12+05:30 IST
‘‘విజయనగరం మహారాజా..
సీఎం జగన్కు మాజీ మంత్రి ముద్రగడ లేఖ
కిర్లంపూడి: ‘‘విజయనగరం మహారాజా వారి కుమారులను బీజేపీ అగ్రనాయకులు గౌరవించిన తీరును ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. మళ్లీ ఇదే అంశంపై లేఖ పంపే అవసరం లేకుండా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా’’ అని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. అశోక్ గజపతిరాజుపై రాష్ట్ర మంత్రులు వాడిన భాషపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన సీఎం జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు. దాని ప్రతిని గురువారం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహంలో విలేకరులకు విడుదల చేశారు. ఆ లేఖతో పాటు అశోక్ గజపతిరాజును, బీజేపీ అగ్రనేత ఎల్కే ఆడ్వాణీ మర్యాదపూర్వకంగా పలకరిస్తున్న ఫోటోను జత చేశారు.