ధాన్యం మద్దతు ధరకు కొనేలా చూడండి

ABN , First Publish Date - 2020-08-05T11:30:00+05:30 IST

ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎన్నో కష్టనష్టాలకోర్చి వరి సాగు చేసిన రైతులు నష్టపోకుండా ప్రభుత్వ ..

ధాన్యం మద్దతు ధరకు కొనేలా చూడండి

కలెక్టరుకు రైతు సంఘాల సమాఖ్య వినతి


నెల్లూరు(వ్యవసాయం), ఆగస్టు 4 : ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎన్నో కష్టనష్టాలకోర్చి వరి సాగు చేసిన రైతులు నష్టపోకుండా ప్రభుత్వ మద్దతు ధరకు వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు కు రైతు సంఘాల సమాఖ్య నాయకులు సోమవారం వినతిపత్రం అందజేశారు. వ్యాపారులు గతంలో కంటే ధర తగ్గించి పుట్టి రూ.12500కు కొనుగోలు చేస్తున్నారని, వర్షాలు పడుతున్న దృష్ట్యా ఇంకా తగ్గించేస్తారనే ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి చిరసాని కోటిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు వీ నిరంజన్‌రెడ్డి, నాయకులు వీ హనుమంతురావు నాయుడు, ఏవీఆర్‌ నాయుడు, నెల్లూరు నరసయ్యలు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-05T11:30:00+05:30 IST